మంత్రి మల్లారెడ్డి పదవికి ఎసరు.. మైనంపల్లి ఇంట్లో ఎమ్మెల్యేల కీలక నిర్ణయం..??

by Disha Web Desk 19 |
మంత్రి మల్లారెడ్డి పదవికి ఎసరు.. మైనంపల్లి ఇంట్లో ఎమ్మెల్యేల కీలక నిర్ణయం..??
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఇంట్లో జరిగిన మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ భేటీని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. మంత్రి మల్లారెడ్డి తీరుపై చర్చించేందుకే భేటీ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ భేటీలో ఎమ్మెల్యేలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మేడ్చల్ జిల్లాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మల్లారెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించాలని అధిష్టానానికి విన్నావించాలని ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించి.. మేడ్చల్ జిల్లా నుండి ఆ స్థానాన్ని మైనంపల్లికి ఇవ్వాలని అధిష్టానాన్ని ఎమ్మెల్యేలు కోరనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మల్లారెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించేందుకు ఆయన తీరు, వివాదాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కాగా, మంత్రికి వ్యతిరేకంగా జరిగిన మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల భేటీ.. బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉండగా..మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల భేటీపై మైనంపల్లి హన్మంత్ రావు క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తల భవిష్యత్ కోసమే ఈ సమావేశమైనట్లు తెలిపారు. ప్రతిదానిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్‌లో పదవులు తీసుకున్నవాళ్లే మళ్లీ తీసుకుంటున్నారని.. దీంతో పార్టీ కోసం కష్టపడే కేడర్‌కి తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. కార్యకర్తల భవిష్యత్ గురించి ఆలోచించడానికే ఈ భేటీ నిర్వహించినట్లు తెలిపారు. కష్టపడే కార్యకర్తలకు న్యాయం జరగనప్పుడు ఎవరో ఒకరు మాట్లాడాలని.. అప్పుడే విషయం అధిష్టానం దృష్టికి వెళ్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడకపోతే ఎలా అని మైనంపల్లి ప్రశ్నించారు. మేము వద్దన్న వ్యక్తులకు పదవులు ఇచ్చేస్తున్నారని.. కష్టపడుతోన్న క్యాడర్‌కి అన్యాయం జరుగుతోందన్నారు.

నాయకుడు కేడర్ గురించి మాట్లాడకుంటే డమ్మీ ఎమ్మెల్యే అంటారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్‌ను కలవడానికి ప్రయత్నించామని.. కానీ కుదరలేదని చెప్పారు. కేడర్‌కి అన్యాయం జరుగుతుంటే సమావేశం కావడం తప్పేమి కాదన్నారు. కొందరు మూర్ఖులు చేసిన పనుల వల్ల పార్టీ డ్యామేజ్ అవుతోందని.. ఈ వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. దీంతో కేడర్‌లో విశ్వసనీయత పోతోందని.. అది ఎప్పటికైనా ప్రమాదమేనని హెచ్చరించారు. ఈ విషయంపై మీడియా ద్వారా సీఎం కేసీఆర్‌కు మెసేజ్ ఇస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అధిష్టానం గుర్తించాలని కోరారు.

ఇదిలా ఉండగా.. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల భేటీపై మంత్రి రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నట్లుగా అన్ని పదవులు తానేమి తన్నుకుపోలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల భేటీకి పిలిచి ఉంటే తాను కూడా వెళ్లేవాడినని మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more:

అది ఎప్పటికైనా ప్రమాదమే: మంత్రి మల్లారెడ్డిపై MLA మైనంపల్లి కీలక వ్యాఖ్యలు

మేడ్చల్ BRS ఎమ్మెల్యేల రహస్య భేటీ.. తెరపైకి కొత్త అంశం!



Next Story

Most Viewed